Long Moral Stories In Telugu ( అత్యాశ కోడలు )

This is a greedy daughter in law long moral story in Telugu, This is a new moral story in Telugu, The story of the greedy girl. If you are looking for new moral stores in Telugu, this is for you, Read many interesting moral stories in Telugu I hope you enjoy them.

Greedy Daughter in Law Moral Story | అత్యాశ కోడలు

అత్యాశ కోడలు: ఒకప్పుడు ఒక నగరంలో ఒక కుటుంబం ఉండేది, ఆ కుటుంబంలో  ఒక అబ్బాయి మరియు అతని తల్లిదండ్రులు ఉన్నారు. వారు ధనవంతులు  కాదు కాని, వారిలో చాలా ప్రేమ ఉంది. ఆ అబ్బాయి కొన్ని రోజుల తరువాత వివాహం చేసుకున్నాడు.

జాను అనే అమ్మాయితో అతడికి వివాహం అయింది  ఆమె చాలా అత్యాశ గల అమ్మాయి. కిట్టి పార్టీకి వెళ్ళడానికి కొత్త బట్టలు, నగలు తీసుకురావాలని ఆమె తన భర్తను పదేపదే కోరుతూ  ఉంటుంది. తన భర్త ఆమెతో సమానంగా వున్నవారితోనే స్నేహం చేయాలని ఆమెకు వివరించాడు.

Long Moral Story In Telugu (new)

నీవు నెలకు 10 సార్లు కిట్టి పార్టీకి వెళితే, ప్రతిసారీ నీకు కొత్త బట్టలు మరియు నగలు ఎలా లభిస్తాయి. అని అడిగినందుకు  ఆమె తన భర్తతో గొడవపడుతుంది, 

నేను కొత్త బట్టలు లేదా నగలు ధరించకపోతే నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తారని చెప్పింది.

మీరు ఎక్కువ సంపాదించడానికి ఆలోచించరు కాని, నన్ను ఏవి కొనకుండా ఆపుతూ ఉంటారు. దీని తరువాత ఆమె అత్తగారి వద్దకు వెళ్లి అత్తమ్మ మీ ఆభరణాలు నాకు ఇవ్వండి. నేను కిట్టి పార్టీకి వెళ్లాలనుకుంటున్నాను. అని అంటుంది.

అప్పుడు జాను అత్తగారు ఆశ్చర్యపోయి "మా కాలంలో కోడలు తన నగలు అత్తగారికి ఇచ్చేవారు, కాని నీవు  నా నగలు అడుగుతున్నావు".అని అంటుంది. ప్రతి  రోజు కోడలి మాటలతో ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది. ఒక రోజు జాను స్నేహితురాలు శిల్పా జాను ఇంటికి వస్తుంది.

శిల్ప జాను గురించి జాను ఎక్కడ అత్తగారిని అడుగుతుంది. జాను పార్టీకి వెళ్లిందని చెప్తుంది. మీరు ఎందుకు బాధగా కనిపిస్తున్నారని  శిల్ప జాను  అత్తగారిని అడిగింది. అప్పుడు ఆమె " జాను కొత్త నగలు మరియు కొత్త బట్టలను పదేపదే అడుగుతుంది  మరియు ఇంట్లో వున్న డబ్బు మొత్తాన్ని వాటి కోసం ఖర్చు చేస్తుందని" జాను  గురించి మొత్తం చెప్పింది.

ఆభరణాల కన్నా ముఖ్యమైనది అన్నం, కానీ  ఈ విషయాన్ని జానుకి  వివరించాల్సి ఉంటుంది. "అది ఎలా జరుగుతుంది"  అని జాను అత్తగారు అడుగుతారు.  "చూస్తూ వుండండి " అని శిల్ప ఆమెతో  అంటుంది.

శిల్పా తన ఆభరణాలు మరియు కొత్త బట్టలన్నింటినీ  జాను ఇంటికి తీసుకువచ్చి, జాను ఇంట్లో  బియ్యం, సరుకులు  మరియు ఫర్నిచర్ అంతా తన ఇంటికి  తీసుకెళ్లింది. జాను ఇంటికి వచ్చినప్పుడు, ఆమె అల్మారా ‌లో కొత్త నగలు మరియు బట్టలు చూసి చాలా ఆనందంగా ఉంటుంది.

తరువాత, జాను  తన అత్తగారితో, "ఇవి ఎవరివి ?" అని అడుగుతుంది,  ఆమె అత్తగారు "ఇవన్నీ నీకోసమే, మరియు ఇవన్నీ నీవే" నీకు  కావలసినంత ధరించు అని  అంటుంది. జాను అందులో నుండి కొత్త బట్టలు మరియు నగలు ధరించి ఇంట్లో ఆనందంగా నడవడం ప్రారంభించింది.

కొద్దిసమయయం  తర్వాత ఆమె వంటగదికి వెళ్ళినప్పుడు, ఇంట్లో వున్నా సరుకులు, వంట సామాను అంతా కనిపించడం లేదని ఆమె గమనించింది. బియ్యం బాక్సులలో ఆభరణాలు ఉన్నాయి. ఇది ఏమిటని ఆమె అత్తగారిని అడిగింది, ఇంటి వంట సామాను మరియు ఫర్నిచర్ అంతా ఎక్కడికి పోయాయి. అని అంటుంది 

వాటన్నింటినీ అమ్మడం ద్వారానే  నీ కోసం కొత్త ఆభరణాలు, మరియు  బట్టలు తెచ్చానని ఆమె అత్తగారు చెప్పారు. ఇప్పుడు నీవు వాటిని తీసి మల్లి  ధరించు. అని జాను అత్త అంటుంది. ఆ మాటలు విన్న జాను "కానీ మన కడుపు నింపడానికి ఆభరణాలు కావు కదా?  కచ్చితంగా ఆహారం తినాలి ". అంటుంది

అప్పుడు జాను స్నేహితురాలు శిల్పా కూడా అక్కడికి  వస్తుంది. "మీ అత్తగారు మీకు మొదట చెప్పినప్పుడు, మీరు వినలేదని" అంటుంది . కాబట్టి, మేమె  ఇవన్నీ చేసాము. అని జాను తో అంటుంది 

మీ భర్త తగినంతగా సంపాదించలేదని నీకు అనిపిస్తే,  అప్పుడు ఆ పనిని నీవే  ఎందుకు చేసి సంపాదించుకోకూడదు. ఈ అనవసరమైన ఆభరణాలను ధరించి చూపడం వదిలేసి ఇప్పటి  నుండి  మీరు మీ ఇంటిపై దృష్టి పెట్టాలి. అని చెప్పి శిల్ప అక్కడి నుండి వెళ్ళిపోతుంది.  

అప్పుడు జానుకు  కనువిప్పు కలిగి తన తప్పును తెలుసుకుంటుంది.

Also, Read Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు

Moral Of The Story (కథ యొక్క నీతి):

"మనము  అనవసరమైన ఖర్చులను వదిలేసి అవసరమైన  విషయాలపై దృష్టి పెట్టాలి".

Post a Comment

Previous Post Next Post